అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2022-07-09T02:37:36+05:30 IST

శ్రీనగర్: అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి

శ్రీనగర్: అమర్‌నాథ్ ఆకస్మిక వరదల్లో భక్తుల మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. అన్ని విధాలా సాయమందిస్తామని తెలిపారు. 




మరోవైపు మృతుల సంఖ్య 13కు చేరింది. పలువురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడారు. ITBP, CRPF, BSF, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. కుంభవృష్టి సమయంలో అమర్‌నాథ్ గుహకు సమీపంలో 12 వేల మంది భక్తులున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో Amarnathలో కుంభవృష్టి కురిసింది. 

Updated Date - 2022-07-09T02:37:36+05:30 IST