షాతో కలిసి ప్రధానితో భేటీ కానున్న కెప్టెన్!
ABN , First Publish Date - 2021-09-30T01:09:59+05:30 IST
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారని సమాచారం.
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారని సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి ఆయన ప్రధానితో భేటీ అవుతారని తెలిసింది. అంతకుముందు అమరీందర్.. షా నివాసంలో గంటపాటు చర్చించారు. కెప్టెన్ బీజేపీలో చేరతారనే ప్రచారం నడుమ వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పంజాబ్ సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తనను అవమానకరంగా తప్పించిందని కెప్టెన్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో సిద్ధూకు పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని కూడా కెప్టెన్ వ్యతిరేకిస్తున్నారు. సిద్ధూ పాక్కు అనుకూలంగా వ్యవహరిస్తారని, భారత్కు ప్రమాదకారని కెప్టెన్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.