శోభాయమానం...అమరేశ్వరుని దివ్యరథోత్సవం

ABN , First Publish Date - 2020-02-24T09:12:08+05:30 IST

పంచారామాలలో ప్రథమ ఆరామంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లాలోని అమరావతిలో బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా పూలతో

శోభాయమానం...అమరేశ్వరుని దివ్యరథోత్సవం

అమరావతి, ఫిబ్రవరి 23: పంచారామాలలో ప్రథమ ఆరామంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లాలోని  అమరావతిలో  బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి దివ్యరథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేకంగా పూలతో అలంకరించిన దివ్యరథంపై స్వామి కొలువు దీరగా...రథోత్సవం ప్రారంభానికి ముందుగా నిత్యఔపోసన, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. రహదారికి ఇరు వైపుల నిలిచి ఉన్న వేలాది మంది  భక్తులు  రథంపై ఊరేగుతూ వస్తున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వార్లను తిలకించి తన్మయత్వం పొందారు.

Updated Date - 2020-02-24T09:12:08+05:30 IST