తెలుగు రాష్ట్రాలపై ‘నివర్’ తుఫాన్ ప్రభావం

ABN , First Publish Date - 2020-11-25T12:51:56+05:30 IST

తెలుగు రాష్ట్రాలకు నివర్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది.

తెలుగు రాష్ట్రాలపై ‘నివర్’ తుఫాన్ ప్రభావం

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు  ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని  నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు దగ్గర అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే చిత్తూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ (91008 04313)ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-25T12:51:56+05:30 IST