అన్నం పెట్టే అన్నదాతకి తినే అర్హత లేదా?: జేఏసీ నేతలు

ABN , First Publish Date - 2021-12-02T01:21:27+05:30 IST

రైతుల మహాపాదయాత్రపై పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రను భగ్నం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అన్నం పెట్టే అన్నదాతకి తినే అర్హత లేదా?: జేఏసీ నేతలు

నెల్లూరు: రైతుల మహాపాదయాత్రపై పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రను భగ్నం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమపై వైసీపీ శ్రేణులు పైశాచికం ప్రదర్శించారని పేర్కొన్నారు. భోజనం చేయడానికి స్థలమిచ్చిన వారినీ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే అన్నదాతకి తినే అర్హత లేదా? అని ప్రశ్నించారు. కుక్క తోక వంకరలా ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నా ధృఢ సంకల్పంతో ముందుకెళ్తామన్నారు. 

Updated Date - 2021-12-02T01:21:27+05:30 IST