పోలీసుల తీరుపై అమరావతి రైతుల ఆవేదన

ABN , First Publish Date - 2021-12-09T15:54:17+05:30 IST

అమరావతి రైతుల మహాపాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంది.

పోలీసుల తీరుపై అమరావతి రైతుల ఆవేదన

చిత్తూరు జిల్లా: అమరావతి రైతుల మహాపాదయాత్ర చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకుంది. అయితే పోలీసుల ఆంక్షలతో పాదయాత్రపై టెన్షన్ నెలకొంది. రైతుల పాదయాత్ర నిర్వాహకులతో తిరుపతి అర్బన్ పోలీస్ ఇన్చార్జ్ ఆంక్షలపై చర్చించారు. పోలీసులు బెదిరింపులతో బస చేసేందుకు కల్యాణమండపాలు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వాహకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇక్కడ రచ్చ చేయడం బాగోదని పోలీసులు అన్నారని, అయితే 40 రోజులుగా పాదయాత్ర చేస్తున్నామని, ఇటువంటి ఆంక్షలు ఎక్కడా లేవని చెప్పామన్నారు. శాంతియుతంగానే ముందుకు వెళతామని, తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-09T15:54:17+05:30 IST