‘ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పదు’
ABN , First Publish Date - 2021-11-17T00:26:58+05:30 IST
పదహారు రోజుల పాటు పాదయాత్రలో ప్రజల మద్దతు మరువలేనిదని, గత 700 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని అమరావతి జేఏసీ నేతల పీసీ పేర్కొన్నారు.
అమరావతి: పదహారు రోజుల పాటు పాదయాత్రలో ప్రజల మద్దతు మరువలేనిదని, గత 700 రోజులుగా అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నామని అమరావతి జేఏసీ నేతల పీసీ పేర్కొన్నారు. 700 రోజుల సందర్భంగా మహిళలతో దీపాలతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. రాజధాని కోసం స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించేలా పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. వాస్తవాన్ని గమనించకుండా అసత్యాలు ప్రచారం చేస్తే ప్రభుత్వం సమాధి కావాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావి భవిష్యత్తు తరాల కోసమే తమ పోరాటం అని ప్రజలు కూడా గుర్తించారని చెప్పారు. రాజధాని రైతుల అలుపెరుగని ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు.