అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళన

ABN , First Publish Date - 2020-12-06T05:48:15+05:30 IST

అమరావతిలో రాజధానిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మండలంలోని సామంతపూడి గ్రామానికి చెందిన రైతులు, మహిళలు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు.

అమరావతి రైతులకు మద్దతుగా ఆందోళన
సామంతపూడిలో ఆందోళన చేస్తున్న మహిళలు



దర్శి, డిసెంబరు 5 :అమరావతిలో రాజధానిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మండలంలోని సామంతపూడి గ్రామానికి చెందిన రైతులు, మహిళలు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు.  టీడీపీ జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ మాట్లాడుతూ  రైతుల ఆందోళనలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో మహిళా రైతులు కిలారి కోటేశ్వరమ్మ, నారాయణమ్మ, నల్లూరి వెంకటరత్నం, బ్రహ్మయ్య, పోకూరి అచ్చయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:48:15+05:30 IST