ఉభయగోదావరి జిల్లాలో బహుజన భరోసా యాత్ర

ABN , First Publish Date - 2020-10-23T15:17:52+05:30 IST

జై భీం ఆక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో న్యాయవాది శ్రవణ్ కుమార్ నేతృత్వంలో దళిత బహుజన భరోసా యాత్ర నిర్వహించనున్నారు.

ఉభయగోదావరి జిల్లాలో బహుజన భరోసా యాత్ర

అమరావతి: జై భీం ఆక్సిస్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు  ఉభయగోదావరి జిల్లాల్లో న్యాయవాది శ్రవణ్ కుమార్ నేతృత్వంలో దళిత బహుజన భరోసా యాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పశ్చిమగోదావరి తేతలిలో కులవివక్షత గురి అవుతున్నవారికి జై భీం యాక్సిస్ జస్టిస్ భరోసా కల్పించనుంది. అలాగే మద్యాహ్నం 1 గంటకు తూర్పుగోదావరి సీతానగరంలో శిరోమండనం బాధితుడు వరప్రసాద్‌ను శ్రవణ్‌కుమార్ పరామర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏలేశ్వరంలో పోలీసుల వల్ల ఇబ్బందులు పడ్డ బాధితులను న్యాయవాది శ్రవణ్ పరామర్శించనున్నారు. 

Updated Date - 2020-10-23T15:17:52+05:30 IST