కృష్ణా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కన్నబాబు
ABN , First Publish Date - 2020-09-28T12:50:11+05:30 IST
భారీ వర్షాల కారణంగా కృష్ణాకు వరద ఉధృతికి అధికంగా ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
అమరావతి: భారీ వర్షాల కారణంగా కృష్ణాకు వరద ఉధృతికి అధికంగా ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. వరద ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6,65,925 క్యూసెక్కులుగా ఉందన్నారు. ఈ క్రమంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు.