ప్రభుత్వ భవనాల రంగులపై ఉన్నతస్థాయి కమిటీ
ABN , First Publish Date - 2020-04-03T08:58:59+05:30 IST
ప్రభుత్వ భవనాల రంగులపై ఉన్నతస్థాయి కమిటీ
అమరావతి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు ఎలాంటి రంగులు వేయాలన్నదానిపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. రంగుల విషయంలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే!. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మార్గదర్శకాలను జారీచేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురవడంతో ప్రభుత్వం సీసీఎల్ఏను చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసింది.