‘పాత్రికేయుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2020-04-03T08:51:11+05:30 IST

‘పాత్రికేయుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి’

‘పాత్రికేయుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి’

ఒంగోలు(కలెక్టరేట్‌); ఏప్రిల్‌ 2: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్‌ చేశారు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే జర్నలిస్టులు కరోనా వైరస్‌ నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో జర్నలిస్టులకు సేఫ్టీ కిట్స్‌ ఇచ్చే విధంగా చూడాలన్నారు. ప్రతి జర్నలిస్టులకూ రూ.5 వేలు తక్షణ సహాయం అందించాలని కోరారు. ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్‌ స్కీం మార్చి 31తో ముగిసిందని తెలిపారు. జర్నలిస్టుల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి రెన్యువల్‌ చేయాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే సూచన మేరకు మంత్రి బాలినేని  జర్నలిస్టులకు బియ్యం, కందిపప్పును ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Updated Date - 2020-04-03T08:51:11+05:30 IST