అమరావతికే నా సంపూర్ణ మద్దతు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2021-07-13T00:22:35+05:30 IST

అమరావతిపై తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. తాను అమరావతికే

అమరావతికే నా సంపూర్ణ మద్దతు: ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: అమరావతిపై తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీలో సోమవారం తన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తాను అమరావతికే మద్దతిస్తానన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ కూడా ఇదే మాట చెప్పిందన్నారు. తాను కూడా ఎన్నికల ప్రచారంలో ఇదే మాట చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తమ అధినేత అమరావతిలోనే ఇళ్లు కట్టుకున్నారంటూ.. ఇక్కడే ఉంటారంటూ ప్రచారంలో చెప్పానన్నారు. ప్రచారంలో పార్టీ సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నానని, ఈ మధ్యలో తమ నాయకులు మాత్రం మాటలు, మడమలు తిప్పేస్తున్నారని ఎద్దేవా చేశారు. తానైతే అమరాతికే కట్టుబడి ఉన్నానన్నారు.



Updated Date - 2021-07-13T00:22:35+05:30 IST