అమరావతి భూములతో ఆళ్ల డ్రామాలు
ABN , First Publish Date - 2021-07-12T13:01:50+05:30 IST
వందల కోట్ల అవినీతితో..
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
తెనాలి టౌన్: వందల కోట్ల అవినీతితో దొరికిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి భూములతో డ్రామాలాడుతున్నారని, ఎస్సీ లను అవమానపరచేలా అమరావతిలో రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సింగ మనల రాజు ఆరోపించారు. ఆదివారం ఐతానగర్లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. కరకట్టపై కమలహాసన్లా నటన బాగా చేస్తు న్నారని ఎద్దేవా చేశారు. ప్రతిసారి అమరావతిలో దళితుల భూములు చంద్రబాబు లాక్కున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దళితుల భూములను లాక్కున్న చరిత్ర ఇడుపులపాయ నుంచి మొదలైందన్నారు. వైఎస్సార్, జగన్ల కంటే అవినీతి కుటుంబం రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. విశాఖలో బాక్సైట్ తవ్వకాల అవినీతిలో నేరుగా జగన్ ప్రమేయం ఉందని అక్కడి ప్రజలే నమ్ముతున్నారని ఆరో పించారు. చంద్రబాబుపై ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు ఎన్ని సార్లు చేసినా నిరూపించ లేకపోయారన్నారు. ఆళ్లకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే అమరావతిలో పోరా టం చేస్తున్న వారి పక్షాన నిలబడాలని సూచించారు.