రాజధానిపై స్టేటస్ కో ఏపీ ప్రభుత్వానికి శరాఘాతం: రఘురామకృష్ణంరాజు
ABN , First Publish Date - 2020-08-05T03:49:35+05:30 IST
అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని...
హైదరాబాద్: అమరావతి రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలు తొలి విజయం మాత్రమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతి మహిళలకు ఈ విజయాన్ని అంకితమివ్వాలన్నారు. అమరావతి తరలింపుపై రాబోయే రోజుల్లో స్టే వస్తుందని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. ‘‘న్యాయస్థానంలో న్యాయం రావాలంటే కొంచెం సమయం పట్టొచ్చు. కానీ ఆ సమయం వరకూ కూడా స్టే ఉంటుంది. అంతవరకూ కూడా సంయమనం పాటించాలి. గాంధీయవాదంతో పోరాటం చేస్తే తప్పకుండా అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ప్రభుత్వానికి శరాఘాతం. న్యాయం రైతుల పక్షానే ఉంది.’’ అని అన్నారు.