రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2021-09-30T03:05:14+05:30 IST
రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట
అమరావతి: రాజధాని దళిత రైతు పులి చిన్నాకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ నదిగం సురేష్ అనుచరులు తనపై దాడి చేస్తే పోలీసులు తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా అక్రమ కేసులు బనాయించారని పులి చిన్నా హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ నదిగం సురేష్, అనుచరులు, పోలీసులతో పులి చిన్నాకు ప్రాణహాని ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. దీంతో తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. పులి చిన్నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.