రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత రైతు వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-08-03T21:06:41+05:30 IST

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్దండరాయునిపాలేనికి చెందిన దళిత రైతు పులి పూర్ణచంద్రరావు వినూత్న నిరసనకు దిగారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత రైతు వినూత్న నిరసన

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఉద్దండరాయునిపాలేనికి చెందిన దళిత రైతు పులి పూర్ణచంద్రరావు వినూత్న నిరసనకు దిగారు. నేలపాడులోని ఎన్టీవో టవర్‌ను ఆనుకొని ఉన్న భారీ క్రేన్ పైకెక్కి అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని హామీ వచ్చేంత వరకు దిగొచ్చేదిలేదని భీష్మించారు. 

Updated Date - 2020-08-03T21:06:41+05:30 IST