డిసెంబర్ 10లోగా పీఆర్సీ‌పై ప్రభుత్వం నిర్ణయం: వెంకట్రామిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-26T00:21:39+05:30 IST

డిసెంబర్ 10లోగా పీఆర్సీ‌పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పీఆర్సీ విషయంలో ..

డిసెంబర్ 10లోగా పీఆర్సీ‌పై ప్రభుత్వం నిర్ణయం: వెంకట్రామిరెడ్డి

అమరావతి: డిసెంబర్ 10లోగా పీఆర్సీ‌పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని  సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. పీఆర్సీ విషయంలో వెంటనే  తేల్చాలని సీఎం జగన్‌ను కోరామని ఆయన చెప్పారు. పీఆర్సీ  ప్రకటన  అసెంబ్లీ వల్ల ఆలస్యమైందని సీఎం  చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వారం పది రోజుల్లో పీఆర్సీ‌పై ప్రభుత్వం నిర్ణయం  తీసుకుంటుందన్నారు. పదిరోజుల్లో పీఆర్సీ ప్రక్రియ  పూర్తవుతుందని సీఎం చెప్పినట్లు వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-26T00:21:39+05:30 IST