ప్రజల రెంఫరెండ్ కోరేందుకు సిద్ధమేనా?
ABN , First Publish Date - 2020-08-02T13:02:32+05:30 IST
అమరావతి మార్పు, మూడు రాజధానుల విషయంపై ఎంపీ..
ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరుటౌన్(గుంటూరు): అమరావతి మార్పు, మూడు రాజధానుల విషయంపై ఎంపీ, ఎమ్మెల్యేలు అందరూ పదవులకు రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండమ్ కోరాలని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నరేంద్రకుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం 30 వేల మంది రైతులు, 33 వేల ఎకరాల భూములు ఇస్తే నేడు తరలించటం రైతుల త్యాగాలను అవమానించటమే నని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజధానిపై ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకొక మాట చెప్పటం అయిన ద్వంద వైఖరికి నిదర్శనంగా పేర్కొన్నారు. నాడు వైసీపీ మానిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతే రాజధాని అని చెప్పటం వాస్తవం కాదా అన్ని గుర్తు చేశారు. రాజధానిపై బీజేపీ పునరాలోచించుకోవాలని సూచించారు.