అమరావతికి మద్దతుగా Gunturలో టీడీపీ శ్రేణుల ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-16T17:47:28+05:30 IST

ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు

అమరావతికి మద్దతుగా Gunturలో టీడీపీ శ్రేణుల ర్యాలీ

గుంటూరు: ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావంగా ఈ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ పుర వేదిక నుంచి రైల్వే స్టేషన్ వరకూ టీడీపీ శ్రేణులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-16T17:47:28+05:30 IST