చంద్రబాబుకి ఇప్పుడు ట్రైలర్ కనిపించింది.. మరో నాలుగేళ్లలో..: ఆమంచి

ABN , First Publish Date - 2020-05-30T18:57:21+05:30 IST

ప్రకాశం: ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబుకి ట్రైలర్ కనిపించిందని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలిపారు

చంద్రబాబుకి ఇప్పుడు ట్రైలర్ కనిపించింది.. మరో నాలుగేళ్లలో..: ఆమంచి

ప్రకాశం: ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబుకి ట్రైలర్ కనిపించిందని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలిపారు. మరో నాలుగేళ్ల పాలనలో చంద్రబాబుకి క్లైమాక్స్ కనపడుతుందన్నారు. సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు తన తనయుడు లోకేష్‌ని మంగళగిరిలో గెలిపించుకోలేక పోయారన్నారు. 


లోకేష్‌ని అసెంబ్లీకి పంపాలంటే జగన్ కాళ్లు పట్టుకుని వైసీపీ టిక్కెట్ అడగాల్సిన పరిస్థితి నెలకొందని ఆమంచి పేర్కొన్నారు. గతంలో మంత్రి పదవులు ఆశ చూపి వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ గుమ్మం దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కరోనా సాకుతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయి తలదాచుకున్నాడని ఆమంచి విమర్శించారు.

Updated Date - 2020-05-30T18:57:21+05:30 IST