అమలాపురం తహశీల్దార్ బదిలీ... ప్రజల సంబరాలు
ABN , First Publish Date - 2022-04-27T16:31:08+05:30 IST
కోనసీమ జిల్లా అమలాపురం తహశీల్దార్ ఠాగూర్ బదిలీతో కార్యాలయం ఎదుట ప్రజలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
కాకినాడ: కోనసీమ జిల్లా అమలాపురం తహశీల్దార్ ఠాగూర్ బదిలీతో కార్యాలయం ఎదుట ప్రజలు బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. అమలాపురం మండల తహశీల్దార్గా ఉన్న ఠాగూర్ పి.గన్నవరం తాహశీల్దార్గా బదిలీ అయ్యాయి. ఠాగూర్ వ్యవహార శైలితో మండల ప్రజలు విసిగిపోయారు. ఏ పని కావాలని వెళ్ళినా తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఠాగూర్ బదిలీ కావడంతో అర్ధరాత్రి కార్యాలయం ఎదుట కొందరు వ్యక్తులు బాణాసంచా కాల్చారు. తహశీల్దార్ బదిలీ కావడంతో మండల ప్రజలకు విముక్తి కలిగింది అంటూ పలుచోట్ల ప్రజలు స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని తెలియజేశారు.