అళ్వార్‌ ట్యాంకులో పడి పారిశుధ్య కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:20:31+05:30 IST

తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంకులో ఓ పారిశుధ్య కార్మికుడి మృతదేహాన్ని శుక్రవారం సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

అళ్వార్‌ ట్యాంకులో పడి పారిశుధ్య కార్మికుడి మృతి

తిరుమల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంకులో ఓ పారిశుధ్య కార్మికుడి మృతదేహాన్ని శుక్రవారం సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులకు మెడలో ఓ గుర్తింపు కార్డు లభించింది. అందులో ఆర్వీ గ్రూప్‌ సంస్థలో హౌస్‌కీపింగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్న బి.రామూర్తిగా వివరాలున్నాయి. అతడు ఆళ్వార్‌ ట్యాంక్‌లో పడి ఎలా, ఎందుకు చనిపోయాడనే విషయాలపై టూటౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:20:31+05:30 IST