పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2021-04-19T04:16:09+05:30 IST

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మహేశ్వరం : సమ్మేళనంలో పాల్గొన్న పూర్వవిద్యార్థులు

ఆదిభట్ల/మహేశ్వరం: మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2005-06 బ్యాచ్‌ పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు  ఆదివారం సమ్మేళనం నిర్వహించారు. కొంగరకలాన్‌ గ్రామ పరిధిలోని ఓ  ఫంక్షన్‌ హాల్‌లో అప్పటి విద్యార్థులందరూ కలుసుకుని, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు అశోక్‌, యాదయ్య, శ్రీనివా్‌సరావులను సత్కరించారు. మహేశ్వరం మండల కంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1987-88వ బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దోమ శ్రీనివా్‌సరెడ్డి, గోవర్ధన్‌యాదవ్‌, వత్తుల నారాయణ, జ్యోతి, జంగయ్య, సునీల్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T04:16:09+05:30 IST