అల్పపీడనంపై అప్రమత్తం

ABN , First Publish Date - 2022-08-14T05:17:43+05:30 IST

జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు.

అల్పపీడనంపై అప్రమత్తం

  కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, ఆగస్టు 13 :  జిల్లాపై అల్పపీడన ప్రభావం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు శనివారం జిల్లా, మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు. ఒడిశాలో అధిక వర్షాలు కురిస్తే జిల్లాలో వంశధార, నాగావళి నదులకు ఆకస్మిక వరద పోటెత్తనుందని చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూము నెంబర్‌కు 08963-293046 తెలియజేయాలని కోరారు.


111111111111111111111


 

 

Updated Date - 2022-08-14T05:17:43+05:30 IST