AP News: విహారయాత్రలో విషాదం...

ABN , First Publish Date - 2022-09-26T19:18:15+05:30 IST

జిల్లాలోని చింతూరు మండలం సోకిలేరు వాగులో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ఫాల్స్‌ దగ్గర ముగ్గురు టెన్త్‌ విద్యార్థినిలు గల్లంతయ్యారు.

AP News: విహారయాత్రలో విషాదం...

అల్లూరి: జిల్లాలోని చింతూరు మండలం సోకిలేరు వాగులో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ఫాల్స్‌ దగ్గర ముగ్గురు టెన్త్‌ విద్యార్థినిలు గల్లంతయ్యారు. ఈరోజు ఉదయం చీరాల శ్రీహనుజ్ఞ హైస్కూల్ విద్యార్థినులు విహారయాత్ర కోసం సోకిలేరు వాగు వద్దకు వచ్చారు. ఈ క్రమంలో చింతూరు వ్యూ పాయింట్ దగ్గర సోకిలేరు వాగులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో గాలించగా... ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు జయశ్రీ (14), కమల (14)గా గుర్తించారు. గల్లంతైన మరో విద్యార్థిని గీతాంజలి కోసం  గాలింపు కొనసాగుతోంది. 

Updated Date - 2022-09-26T19:18:15+05:30 IST