పెళ్లి రోజు...ఎంతో ప్రత్యేకంగా!
ABN , First Publish Date - 2021-03-07T05:39:09+05:30 IST
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు శనివారం ఆగ్రాలో సందడి చేశారు. పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ను సందర్శించారు
అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు శనివారం ఆగ్రాలో సందడి చేశారు. పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ను సందర్శించారు. ఇరువురూ అక్కడ దిగిన ఫొటోలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ‘‘క్యూటీ... మన ఇద్దరికీ పదో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ పదేళ్లు ఎంతో అందంగా గడిచాయి. మరెన్నో ఏళ్లు మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. పెళ్లి రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు.