అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారంటూ..
ABN , First Publish Date - 2020-07-06T21:42:54+05:30 IST
దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది.
గుంటూరు జిల్లా: దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం వద్ద గందరగోళం నెలకొంది. ఇళ్ళ స్థలాలు ఎంపిక విషయంలో అర్హులకు అన్యాయం జరిగిందంటూ బాధితులు ఆందోళనకు దిగారు. అనర్హులకు ఇళ్ళ స్దలాలు కేటాయిస్తున్నారని మండిపడుతూ అధికారులను చుట్టముట్టారు. దీంతో అధికారులు కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.