92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాల కేటాయింపు
ABN , First Publish Date - 2021-01-16T07:11:34+05:30 IST
జిల్లాలో పదోన్నతి పొందిన 92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాలను కేటాయించారు.
చిత్తూరు (సెంట్రల్), జనవరి 15: జిల్లాలో పదోన్నతి పొందిన 92 మంది టీచర్లకు తాత్కాలిక స్థానాలను కేటాయించారు. శుక్రవారం డీఈవో నరసింహారెడ్డి అధ్యక్షతన స్థానిక డీఈవో సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ల (ఎస్ఏ) నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిలో 43 మందికి, ఎస్జీటీల నుంచి ఎస్ఏలుగా పదోన్నతి పొందిన వారిలో.. తెలుగు 36 మందికి, హిందీ 13 మందికి తాత్కాలిక స్థానాలు కేటాయించారు. ఏడీ పురుషోత్తం, సూపరింటెండెంట్లు నాగరాజు, సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్ గోపాల్, ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.