అలయెన్స్ ఎయిర్ సీఈవోగా హర్ప్రీత్
ABN , First Publish Date - 2020-11-01T10:07:17+05:30 IST
భారత విమానయాన సంస్థకు తొలిసారి ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ సీఈవోగా హర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు...
న్యూఢిల్లీ, అక్టోబరు 31: భారత విమానయాన సంస్థకు తొలిసారి ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ సీఈవోగా హర్ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సల్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు అలయెన్స్ ఎయిర్ సీఈవోగా హరప్రీత్సింగ్ కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఫ్లైట్ సేఫ్టీ)గా ఉన్నారు. ఆ స్థానాన్ని సీనియర్ కమాండర్ కెప్టెన్ నివేదిత భాసిన్ భర్తీ చేయనున్నారు. హర్ప్రీత్సింగ్ తొలి మహిళా పైలట్ కూడా. ఆమె 1988లో ఎయిరిండియాలో చేరారు.