భర్తపై పెళ్లికి ముందు అత్యాచారం కేసు.. వివాహం తర్వాత భార్య మాటల్లో మార్పు.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

ABN , First Publish Date - 2022-04-25T21:06:24+05:30 IST

ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది..

భర్తపై పెళ్లికి ముందు అత్యాచారం కేసు.. వివాహం తర్వాత భార్య మాటల్లో మార్పు.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

ఆమె ఓ యువకుడితో ప్రేమలో పడింది.. అతడితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది.. అయితే ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అతడిపై అత్యాచారం కేసు పెట్టింది.. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో ఆ యువకుడు దిగి వచ్చాడు.. ఆమెను వివాహం చేసుకున్నాడు.. దీంతో ఆమె మాట మార్చింది.. తనపై ఎలాంటి అత్యాచారమూ జరగలేదని చెప్పింది.. దీంతో ఆగ్రహించిన కోర్టు పిటిషనర్‌కు రూ.10 వేల జరిమానా విధించింది. 


ఉత్తరప్రదేశ్‌లోని అలాహాబాద్‌కు చెందిన ఓ యువతి తన ప్రియుడితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఆ తర్వాత ఆ ప్రియుడు ఆమెకు మొహం చాటేశాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించి అత్యాచారం కేసు పెట్టింది. కేసు కోర్టులో విచారణలో ఉన్న సమయంలో బాధిత మహిళతో నిందితుడు రాజీ చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ మాటలు మార్చింది. వివాహానికి ముందు తన భర్తతో తను శారీరకంగా కలవలేదని చెప్పింది. 


మహిళ మాటలు మార్చడంపై అలహా‌బాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై ఒత్తిడి తెచ్చేందుకు మహిళ పెట్టిన తప్పుడు కేసుగా పేర్కొంది. కోర్టు సమాయాన్ని వృథా చేసినందుకు మహిళకు రూ.10 వేలు జరిమానాగా విధించింది.

Updated Date - 2022-04-25T21:06:24+05:30 IST