వాహనాలన్నీ రోడ్డుపైనే..

ABN , First Publish Date - 2022-08-02T05:05:48+05:30 IST

వాణిజ్య భవనాలు నిర్మించేటప్పుడు తప్పనిసరిగా సెల్లార్‌ ఏర్పాటు చేసుకోవాలి.. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను అందులోనే పార్కింగ్‌ చేయాలి. ఇదీ మౌలిక నిబంధన. దీనిని విజయనగరంలో ఎవరూ పట్టించుకోవడం లేదు.

వాహనాలన్నీ రోడ్డుపైనే..



వాణిజ్య భవనాలు నిర్మించేటప్పుడు తప్పనిసరిగా సెల్లార్‌ ఏర్పాటు చేసుకోవాలి.. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను అందులోనే పార్కింగ్‌ చేయాలి. ఇదీ మౌలిక నిబంధన. దీనిని విజయనగరంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా మంది భవన యజమానులు సెల్లార్‌ను ఏర్పాటు చేయడం లేదు. కొందరు ప్రత్యేకంగా స్థలం కేటాయించినా పార్కింగ్‌కు కాకుండా అక్కడా వ్యాపారానికే వినియోగిస్తున్నారు. దీంతో వినియోగదారులకు ప్రధాన రోడ్డు మార్గమే పార్కింగ్‌ స్థావరంగా కనిపిస్తోంది.  ట్రాఫిక్‌ సమస్యలకు ఇదో మూల కారణంగా ఉంది. పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరీ ఆలయం, ఎంజీ రోడ్డు, డాబాతోట, వెంకటలక్ష్మీ థియేటర్‌ రోడ్డు, మూడు లాంతర్లు, రైల్వే స్టేషన్‌ రోడ్డు, రింగురోడ్డు ఇలా చాలా చోట్ల నిబంధనలు అటకెక్కిపోతున్నాయి. సెల్లార్‌లు ఉండి పార్కింగు లేని భవన యాజమానులకు ఇప్పటికే నోటీసులు అందజేశామని కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ అమ్మాజీరావు చెబుతున్నారు.
        - విజయనగరం రింగురోడ్డు

Updated Date - 2022-08-02T05:05:48+05:30 IST