మన భూభాగం మనతోనే ఉంది: ఐటీబీపీ చీఫ్

ABN , First Publish Date - 2020-07-12T23:58:57+05:30 IST

తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి ఇండియా, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ)..

మన భూభాగం మనతోనే ఉంది: ఐటీబీపీ చీఫ్

గురుగావ్: తూర్పు లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి ఇండియా, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ సుర్జీత్ సింగ్ దేశ్వాల్ స్పష్టత ఇచ్చారు. భారత దేశానికి చెందిన యావత్ భూభాగం మనతోనే ఉందని తెలిపారు. ఆదివారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ఉద్రిక్తతలతో తలెత్తిన పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని చెప్పారు. మిలటరీ స్థాయిలోనూ, దౌత్య, ద్వైపాకిక స్థాయిలోనూ చర్చలు జరిగాయని చెప్పారు. హక్కుభుక్తంగా మనకు చెందిన భూభాగాన్ని కాపాడుకునే సామర్థ్యం మన దేశానికి ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనూ దాన్ని కాపాడుకుంటామని చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇండో, చైనాల వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దేశ్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - 2020-07-12T23:58:57+05:30 IST