పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి : సునీత

ABN , First Publish Date - 2021-09-19T05:45:53+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు.

పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి : సునీత
మోటకొండూరులో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునీత

ఆలేరు రూరల్‌, సెప్టెంబరు 18 : టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పని చేయాలని ప్రభుత్వ విప్‌,  ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల కమిటీని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దేశంలో ఎవరూ చేయని వి ధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.  రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడిగా బొట్ల యాదగిరి, సెక్రటరీ జనరల్‌గా ఎర్ర మల్లే్‌షయాదవ్‌, ప్రధాన కార్యదర్శులుగా అంబాల శ్రీనివాస్‌, బోరెడ్డి రవీందర్‌రెడ్డి, దొంతిరి శ్రీరాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా నాగిరెడ్డి బాలరాజు, దయాకర్‌రెడ్డి, కార్యదర్శులుగా శ్రీనివా్‌సరెడ్డి, సిద్ధిరాములు, బుచ్చిరెడ్డి, అధికార ప్రతినిధిగా రాంచంద్రయ్య, యు వజన విభాగం మండల అధ్యక్షుడిగా గీస కృష్ణంరాజు, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా అనిల్‌రెడ్డిని ఎన్నుకున్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-19T05:45:53+05:30 IST