పోలీసులందరూ వ్యాక్సిన్ వేసుకోండి: ఎస్పీ
ABN , First Publish Date - 2021-02-25T04:40:42+05:30 IST
జిల్లాలో పోలీసులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎస్పీ సెంథిల్కుమార్ పిలుపునిచ్చారు.
చిత్తూరు, ఫిబ్రవరి 24: జిల్లాలో పోలీసులందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎస్పీ సెంథిల్కుమార్ పిలుపునిచ్చారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఆయన వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆయా పోలీసు స్టేషన్ల సమీపాల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని, పోలీసులందరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ డీఎన్ మహేష్, ట్రాఫిక్ డీఎస్పీ తిప్పేస్వామి, డీపీవో ఏవో ఎంవీ.మోహన్, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసమూర్తి, ఆర్ఐలు వీరేశ్, ఈశ్వరరావు, సిబ్బంది వ్యాక్సిన్ వేసుకున్నారు.