కౌమార దశ ఎంతో కీలకం

ABN , First Publish Date - 2021-04-17T05:45:28+05:30 IST

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 16: విద్యార్థులకు కౌమార దశ ఎంతో కీలకమని, ఈ దశపై అవగాహనతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి, డీవైఈవో దాట్ల సుభద్ర తెలిపారు. శుక్రవారం కాకినాడ

కౌమార దశ ఎంతో కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ చిరంజీవినీకుమారి

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 16: విద్యార్థులకు కౌమార దశ ఎంతో కీలకమని, ఈ దశపై అవగాహనతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ పి.చిరంజీవినీకుమారి, డీవైఈవో దాట్ల సుభద్ర తెలిపారు. శుక్రవారం కాకినాడ రూరల్‌ గైగోలుపాడు జడ్పీ హైస్కూల్లో ఏఐడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జెండర్‌ సెన్సిటైజేషన్‌ అంశంపై 2రోజుల పాటు జరిగే సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలపై వివక్ష లేని మెరుగైన సమాజం కోసం అంతా కృషి చేయాలన్నారు. కౌమర దశలో వచ్చే మార్పులు, ఆరోగ్యంపై డాక్టర్‌ ఆర్వీ రమణారావు, డాక్టర్‌ కె.శైలజ వివరించారు. హెచ్‌ఎం సీహెచ్‌ రవి, ఏఐడబ్ల్యూసీ కార్యదర్శి భానుమతి, కోశాధికారి పద్మజావాణి, పీఎంసీ చైర్మన్‌ విమల్లీశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:45:28+05:30 IST