మార్చి 1 నుంచి ఆల్‌ఇండియా సీనియర్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2021-02-27T05:09:14+05:30 IST

కడపలోని ఆఫీసర్స్‌క్లబ్‌, యునైటెడ్‌క్లబ్‌, పోలీ్‌సకోర్టుల్లో గల టెన్నీ్‌స కోర్టు మైదానాలలో మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆల్‌ఇండియా సీనియర్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ పాట్రాన్‌ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి పేర్కొన్నారు.

మార్చి 1 నుంచి ఆల్‌ఇండియా సీనియర్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌

కడప మారుతీనగర్‌, ఫిబ్రవరి 26: కడపలోని ఆఫీసర్స్‌క్లబ్‌, యునైటెడ్‌క్లబ్‌, పోలీ్‌సకోర్టుల్లో గల టెన్నీ్‌స కోర్టు మైదానాలలో మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆల్‌ఇండియా సీనియర్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ పాట్రాన్‌ కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం కడప ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్‌ టెన్నీస్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. విజేతలకు బహుమతిగా రూ.3లక్షలు అందజేస్తామన్నారు. మా నాన్న జ్ణాపకార్థం జరుపతలపెట్టిన టోర్నమెంట్‌తో పాటుగా వచ్చే ఏప్రిల్‌ 15న ఆయన 72వ జయంతి సందర్బంగా మరిన్ని క్రీడాపోటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. సమావేశంలో టోర్నమెంట్‌ డైరెక్టర్‌ జీవావిలియమ్స్‌, యునైటెడ్‌ క్లబ్‌ కార్యదర్శి డి.శివారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:09:14+05:30 IST