TS News: టీఆర్ఎస్కు బిగ్ షాక్
ABN , First Publish Date - 2022-07-27T16:41:26+05:30 IST
అధికార పార్టీ టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది.
నిజామాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS)కు పెద్ద షాక్ తగిలింది. ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి (Mohan reddy) టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. మోహన్ రెడ్డి బీజేపీ (BJP)లో చేరనున్నారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలను మోహన్ రెడ్డి కలిశారు. ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణలో మోహన్ రెడ్డి కీలకంగా పని చేశారు. టీఆర్ఎస్ నేతల వైఖరి నచ్చకపోవడంతో మోహన్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.