ఉద్యోగులందరూ మా కుటుంబసభ్యులే: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
ABN , First Publish Date - 2022-02-03T23:35:36+05:30 IST
రాష్ట్రంలోని ఉద్యోగులు అందరూ తమ కుటుంబసభ్యులేనని సీఎం, మంత్రులు
అమరావతి: రాష్ట్రంలోని ఉద్యోగులు అందరూ తమ కుటుంబసభ్యులేనని సీఎం, మంత్రులు చెబుతున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. చర్చల విషయంలో ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. ఉద్యోగులు చర్చలకు రావాలని, ఉద్యోగస్తులకు సీఎం మంచి చేస్తారని ఆయన పేర్కొన్నారు. సీఎంనే కలవాలని ఉద్యోగులు ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మంత్రుల కమిటీతో మాట్లాడితే ఆ వివరాలు వారే సీఎంకు చెబుతారని ఆయన తెలిపారు. ఉద్యోగుల ఉద్యమం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు.