Alert: ఢిల్లీలో డ్రోన్ దాడికి అవకాశం..!

ABN , First Publish Date - 2021-07-21T02:42:49+05:30 IST

ఆగస్టు 5న దేశరాజధానిలో డ్రోన్ దాడి చేసి కల్లోలం సృష్టించేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు కుట్రపన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

Alert: ఢిల్లీలో డ్రోన్ దాడికి అవకాశం..!

న్యూఢిల్లీ: ఆగస్టు 5న దేశరాజధానిలో డ్రోన్ దాడి చేసి కల్లోలం సృష్టించేందుకు పాకిస్థానీ ఉగ్రవాదులు కుట్రపన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ ఢిల్లీ భద్రతాదళాలకు సూచించాయి. దేశంలో కల్లోలం సృష్టించేందుకు ఆర్టికల్ 370 రద్దయిన రోజునే ఉగ్రవాదులు ఎంచుకున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. జమ్మూ ఎయిర్ పోర్టు డ్రోన్ దాడి తరువాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వారు ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ దాడులను అరికట్టడం కోసం ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సిబ్బందితో కలిసి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-07-21T02:42:49+05:30 IST