TS News: మద్యం, బిర్యానికి అమ్ముడుపోతే అధోగతే: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2022-05-12T00:36:14+05:30 IST
ఓట్లను మద్యం, బిర్యానికి అమ్ముకున్నంత కాలం బతుకుల్లో మార్పు ఉండదని, జీవితం అధోగతి పాలు కావాల్సిందేనని బహుజన సమాజ్పార్టీ రాష్ట్ర
ఖమ్మం: ఓట్లను మద్యం, బిర్యానికి అమ్ముకున్నంత కాలం బతుకుల్లో మార్పు ఉండదని, జీవితం అధోగతి పాలు కావాల్సిందేనని బహుజన సమాజ్పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపోయినంతకాలం పాలకులు మోసగిస్తూనే ఉంటారన్నారు. దొరలు అనాది నుంచి బహుజనులను మద్యం మత్తులో ఉంచి ఎదగనీయకుండా చేశారని, అగ్రవర్ణాలు దళితులను ఇళ్లలో పాచిపనులకే పరిమితం చేశారని ఆరోపించారు. రాబోయేది బహుజన రాజ్యమేనని, అగ్రవర్ణాల పిల్లల్లా దళితుల పిల్లలను అన్నిరంగాల్లో తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాజ్యాధికార యాత్రకు అపూర్వ స్పందన రావడం.. కేసీఆర్ పాలనపై పెరిగిన విసుగు, వ్యతిరేకతకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ తెలిపారు.