చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తప్ప జగన్ పోలవరంకు చేసింది శూన్యం: ఆలపాటి

ABN , First Publish Date - 2022-03-23T19:47:36+05:30 IST

పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలు గురిగింజ మాదిరిగా ఉన్నాయని ఆలపాటి రాజా ఎద్దేవా చేశారు.

చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తప్ప జగన్ పోలవరంకు చేసింది శూన్యం: ఆలపాటి

గుంటూరు: పోలవరంపై సీఎం జగన్ వ్యాఖ్యలు గురిగింజ మాదిరిగా ఉన్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జలయజ్ణం పేరుతో జగన్ తండ్రి వైఎస్ చేసిన అవినీతిని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తప్ప జగన్ పోలవరంకు చేసింది శూన్యమని విమర్శించారు. ప్రతి యేడాది పోలవరం జాతీకి అంకితం చేస్తామని చెబుతూనే ఉన్నారని, ఒక్క ఎకరానికీ మూడేళ్లలో నీళ్లు ఇవ్వలేక పోయారని విమర్శించారు. వ్యవసాయం అంటే ఏంటో జగన్‌కు తెలియదన్నారు. ఇరిగేషన్ మీద  జగన్ ప్రభుత్వానికి అసలు అవగాహన లేదని, రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కుమ్మక్కైన జగన్.. ఏపీకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు చేపట్టిన పట్టిసీమ వల్ల కృష్ణ డెల్టా రైతులు సంతోషంగా బతుకుతున్నారని, పట్టిసీమను కూడా నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆలపాటి రాజా ఆరోపించారు.

Updated Date - 2022-03-23T19:47:36+05:30 IST