వైభవంగా అక్కిరెడ్డిపాలెం తీర్థం
ABN , First Publish Date - 2021-01-27T06:10:15+05:30 IST
పారిశ్రామిక ప్రాంతంలో అతిపెద్ద తీర్థంగా పేరుగాంచిన అక్కిరెడ్డిపాలెంలోని కుంచమాంబ, దుర్గమాంబ అమ్మవార్ల తీర్ధం మంగళవారం వైభవంగా జరిగింది
అక్కిరెడ్డిపాలెం: పారిశ్రామిక ప్రాంతంలో అతిపెద్ద తీర్థంగా పేరుగాంచిన అక్కిరెడ్డిపాలెంలోని కుంచమాంబ, దుర్గమాంబ అమ్మవార్ల తీర్ధం మంగళవారం వైభవంగా జరిగింది. హైస్కూల్ మైదానంలో జరిగే మహోత్సవాలకు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవ మైదానంలో రంగుల రాట్నం, జెయింట్ వీల్తో పాటు గరిడీలు, తప్పెట గుళ్లు వంటి సాంసృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, వైసీపీ నగర ఉపాద్యక్షులు గుడివాడ లతీష్, సండ్రాన నూకరాజు, గుడివాడ అనూష, సత్యారావు, బి రమణ తదితరులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.