ఆడ‌ప‌డుచు వివాహానికి అఖిలేష్‌... మురిసిన ములాయం బంధుగ‌ణం!

ABN , First Publish Date - 2021-06-20T15:15:53+05:30 IST

ఇంటి ఆడ‌ప‌డుచు పెళ్లి వేడుక‌లో...

ఆడ‌ప‌డుచు వివాహానికి అఖిలేష్‌... మురిసిన ములాయం బంధుగ‌ణం!

సైఫాయి: ఇంటి ఆడ‌ప‌డుచు పెళ్లి వేడుక‌లో ములాయం కుటుంబమంతా క‌లుసుకుంది.పెళ్లికి ఒక రోజు ముందు యూపీలోని సైఫాయిలో జరిగిన విందు కార్య‌క్ర‌మానికి ములాయం సోద‌రుడు శివపాల్‌తో సహా కుటుంబ సభ్యులంతా అతిథులకు ఆహ్వానం పలికారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా, కొద్దిమందిని మాత్రమే విందుకు ఆహ్వానించారు. ఈరోజు జ‌ర‌గ‌నున్న పెళ్లివేడుక కోసం ములాయం ఇంటిని, క‌ల్యాణ‌మండ‌పాన్ని అందంగా అలంక‌రించారు. ములాయం సింగ్ మనవరాలు, మెయిన్‌పురి మాజీ ఎంపీ తేజ్ ప్రతాప్ యాదవ్ సోదరి దీపాలికి ఫిరోజాబాద్‌లోని జస్రానాకు చెందిన జవహర్ సింగ్ యాదవ్ కుమారుడు అశ్వని యాదవ్‌తో వివాహం జ‌ర‌గ‌నుంది. వివాహ విందు కార్య‌క్ర‌మాన్ని రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు. మొదటి రోజున‌ సమీప గ్రామాల ప్ర‌జ‌ల‌తో పాటు కొంతమంది ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. వేడుక‌కు వచ్చిన అతిథుల‌ను ప్రస్పా అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ త‌దిత‌రులు స్వాగ‌తించారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు వివాహానికి హాజ‌ర‌య్యారు. ములాయం సింగ్ యాదవ్ ముందుగానే సైఫాయి చేరుకున్నారు. ములాయం కుటుంబమంతా ఈ వివాహ వేడుక‌కు హాజ‌రయ్యింది. 

Updated Date - 2021-06-20T15:15:53+05:30 IST