అఖిలేష్ యాదవ్‌ను కలిసిన బీజేపీ ఎంపీ రీటాజోషి కుమారుడు

ABN , First Publish Date - 2022-02-23T14:38:50+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సందర్భంగా బుధవారం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ ఎంపీ రీటా జోషి కుమారుడు మయాంక్ జోషితో కలిసి దిగిన ఫోటోను...

అఖిలేష్ యాదవ్‌ను కలిసిన బీజేపీ ఎంపీ రీటాజోషి కుమారుడు

లక్నో(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సందర్భంగా బుధవారం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ ఎంపీ రీటా జోషి కుమారుడు మయాంక్ జోషితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన కుమారుడైన మయాంక్ జోషికి అసెంబ్లీ బీజేపీ టికెట్ ఇస్తే , తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రీటా బహుగుణ ప్రతిపాదించారు.అయినా బీజేపీ అధిష్ఠానం మయాంక్ జోషికి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. బీజేపీ ఎంపీ కుమారుడైన మయాంక్ జోషి ఇటీవల అఖిలేష్ యాదవ్ ను కలిశారు. అయితే మయాంక్ జోషితో మర్యాదపూర్వక సమావేశమని అఖిలేష్ ట్వీట్ చేశారు. లక్నో జిల్లాలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ కుమారుడు అఖిలేష్ ను కలిసిన చిత్రం సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనం రేపింది.


Updated Date - 2022-02-23T14:38:50+05:30 IST