తృణమూల్కు మద్దతుగా ప్రచారం చేస్తాం : అఖిలేశ్
ABN , First Publish Date - 2021-03-04T17:51:10+05:30 IST
అధికార తృణమూల్కు అండగా ఉంటామని సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీకి మద్దతుగా
లక్నో : అధికార తృణమూల్కు అండగా ఉంటామని సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహిస్తామని తెలిపారు. సీఎం యోగి బెంగాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తీవ్ర గందరగోళంలోపడేసి, అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో బీజేపీ సఫలం కాకుండా తాము అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ నేత కిర్మణయి నంద ప్రచార బాధ్యతలు పూర్తిగా చూసుకుంటారని అఖిలేశ్ తెలిపారు. మరో వైపు రెండు రోజుల క్రితమే ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ కూడా సీఎం మమతో భేటీ అయ్యారు. తాము తృణమూల్కు పూర్తి మద్దతుగా నిలబడతామని ప్రకటించారు.