పోటీ చేసే స్థానం ప్రకటించిన అఖిలేష్ యాదవ్

ABN , First Publish Date - 2022-01-20T22:59:50+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన అఖిలేష్ యాదవ్.. తాజాగా తాను పోటీ చేయబోతున్న స్థానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు అఖిలేష్..

పోటీ చేసే స్థానం ప్రకటించిన అఖిలేష్ యాదవ్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన అఖిలేష్ యాదవ్.. తాజాగా తాను పోటీ చేయబోతున్న స్థానాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు అఖిలేష్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభ నుంచి అఖిలేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన రోజే.. అజాంగఢ్ నుంచి పోటీ గురించి ఆయన ప్రస్తావించారు. కానీ అప్పుడు అదే స్థానాన్ని ఖరారు చేసుకోలేదు. అయితే అఖిలేష్ యాదవ్ ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2012లో ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఎమ్మెల్సీ అయ్యారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు.

Updated Date - 2022-01-20T22:59:50+05:30 IST