అఖిల ప్రియకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా...
ABN , First Publish Date - 2021-01-14T19:33:48+05:30 IST
బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు
హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, గైనకాలజి డిపార్ట్మెంట్లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ పరీక్షలు జరుగుతున్నాయి. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత మారేడ్ పల్లి జడ్జ్ నివాసంలో హాజరుపర్చనున్నారు. అనంతరం చంచల్ గూడ మహిళ జైలుకు తరలించనున్నారు.
అంతకుముందు, అఖిల ప్రియకు వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసుల హై డ్రామా వెలుగు చూసింది. మీడియా దృష్టి మరల్చి మరోసారి అఖిల ప్రియను బేగంపేట్లోని పటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కు తీసుకువెళ్లారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన అఖిల ప్రియకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరోనా టెస్ట్ నిర్వహించకుండానే వైద్య పరీక్షల కోసం బోయిన్ పల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అఖిల ప్రియ పోలీస్ వాహనం ముందూ వెనుకా ఎస్కర్ట్గా విమెన్ పోలీసులు ఉన్నారు.