పది వికెట్ల హీరో అజాజ్ పటేల్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ బోర్డు

ABN , First Publish Date - 2021-12-24T03:01:45+05:30 IST

కివీస్ స్టార్ స్పిన్నర్, రాత్రికి రాత్రే ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న స్పిన్నర్ అజాజ్ పటేల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది.

పది వికెట్ల హీరో అజాజ్ పటేల్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్ బోర్డు

క్రైస్ట్‌చర్జ్: కివీస్ స్టార్ స్పిన్నర్, రాత్రికి రాత్రే ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న బౌలర్ అజాజ్ పటేల్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. టీమిండియాతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించిన అజాజ్‌ను.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ నుంచి పక్కనపెట్టింది.


అద్భుమైన ఫామ్‌లో ఉన్న అతడిని ఎందుకు ఎంపిక చేయలేదన్న దానిపై బోర్డు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక, బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసినట్టులో మిగిలిన ఏకైక స్పిన్నర్ రచిన్ రవీంద్ర ఒక్కడే. మరోవైపు, గాయం కారణంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పుకోవడంతో టామ్ లాథమ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు న్యూ ఇయర్ రోజున మౌంట్ మాంగనూయిలో ప్రారంభం అవుతుంది.

Updated Date - 2021-12-24T03:01:45+05:30 IST