ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T03:26:15+05:30 IST

బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఈ నెల 9న జరిగే ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌ కోరారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు.

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు

బెల్లంపల్లి, అక్టోబరు 7: బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఈ నెల 9న జరిగే ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌ కోరారు. శుక్రవారం బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కార్మిక హక్కులను కాలరాయాలని చూస్తోం దని, దీన్ని చూస్తూ ఊరుకోమని తెలిపారు. సభల్లో కార్మికులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నాయకులు మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్‌, శ్రీధర్‌, దాసరి తిరుపతిగౌడ్‌, ప్రశాంత్‌, శంకర్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T03:26:15+05:30 IST